20, జనవరి 2026, మంగళవారం

28 వ సామాన్య ఆదివారం

 

28 వ సామాన్య ఆదివారం

సొలోమోను జ్ఞాన గ్రంధం 7:7-11
హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30

ఈనాటి పరిశుద్ధ గ్రంథములో మన యొక్క జీవితములో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి, ఆయనను కలిగి ఉండుట కొరకు దేనినైనా వదులుకుని జీవించాలి అనే అంశమును గురించి తెలుపుచున్నవి. ప్రతి ఒక్కరి యొక్క అనుదిన జీవితంలో రోజు ఈ లోక సంబంధమైనటువంటి విషయములతో ప్రాముఖ్యతను ఇచ్చి జీవిస్తారు. కొందరికి బంగారము అంటే విలువ ఎక్కువ, అందరికీ వెండి అంటే ఇష్టం, మరికొందరికి పదవులు ఇంకొందరికి సుఖ భోగాలు, గౌరవ మర్యాదలు ఇష్టం అందుకని వాటికి ప్రాముఖ్యతను, విలువనిచ్చి అవి కలిగి ఉండుట కొరకు ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటారు. 

ఈనాటి మొదటి పఠణంలో సొలోమోను తన యొక్క జీవితంలో ఏది ముఖ్యమైనది అని తెలుసుకొని దానికి విలువనిచ్చి ఆ యొక్క వరము కొరకు ప్రార్థించాలి. సొలోమోను దైవ భక్తుడిగా, నీతిమంతుడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు, ఆయనయే స్వయంగా తెలుపుతున్నటువంటి మాటలు ఏమిటంటే నేను ప్రార్థించినప్పుడు వివేక వరము నాకు లభించినది.

 దేవుడిని ప్రార్ధించినది వివేకము కొరకు. జ్ఞానము తాను సంపాదించినట్లయితే ఇంక తన జీవితంలో ఏదీ కూడా అవసరం లేదు అని సొలోమోను గ్రహించాడు కాబట్టి జ్ఞానమును సంపాదించుట కొరకు దేవుని ప్రార్థించారు. మన యొక్క అనుదిన జీవితంలో కూడా మనం దేనికొరకు ప్రార్థిస్తున్నాము అని మనము ఒకసారి పరిశీలించుకోవాలి. సొలోమోను రాజు ఆయన తన యొక్క వివేకము ద్వారా తెలుసుకున్న సత్యమేమిటంటే ఈ లోక పదవుల కన్నా, సంపదల కన్నా, సింహాసనములకన్నా, రాజు దండనముకన్నా విలువైనది జ్ఞానము అని తెలుసుకున్నారు అందుకని దానిని పొందుట కొరకై దేనినైనా సరే వదులుకొనుటకు సిద్ధపడుతున్నారు. సొలోమోను యొక్క విజ్ఞానము వలన తెలుసుకున్న విషయం ఏమిటంటే ఈ లోక సంపదలు ఏవి కూడా జ్ఞానముతో సరిపోవని తెలిపారు. జ్ఞానముతో పోల్చినప్పుడు బంగారమంతా వట్టి ఇసుక ముద్ద, వెండి అనేది మట్టి పెళ్లతో సమానం. ఆయన తన యొక్క జీవితంలో ఆరోగ్యము కంటే సౌందర్యం కంటే ఎక్కువగా జ్ఞానమునే పొందాలని ఆశించాడు. 

మన యొక్క జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనకి ఏది కావాలో అనే అవగాహన లేదు. కొన్ని సందర్భాలలో సంపదలకే ఎక్కువ విలువ ఇస్తాము, కానీ సొలోమోను మాత్రం విజ్ఞానమునకు మొదటి స్థానమును ఇచ్చారు ఎందుకనగా విజ్ఞాన ద్వారా అంతా కూడా సంపాదించవచ్చు. ఆయనకు ఉన్నటువంటి విజ్ఞానమును బట్టి షెభారాణి కూడా ఆయనను చూడటానికి వచ్చారు. ఇంగ్లీష్ లో ఒక సామెత one idea can change your life ఇది ఎలా సాధ్యమంటే మనకు విజ్ఞానం ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే. మనము కూడా విజ్ఞానమును దేవుని యొక్క కృప వలన పొందాలి. విజ్ఞానము కొరకు ప్రార్థించాలి ఈ యొక్క విజ్ఞానముతో మన యొక్క జీవితములో ఏది ఉత్తమమైనదో అది తెలుసుకొని దాని ప్రకారంగా జీవింప సాగాలి. విజ్ఞానము మనకు నేర్పిస్తుంది మన జీవితంలోను సరి చేస్తూ ఉన్నది కావున సొలోమోను ఏ విధముగానయితే దేవుని యొక్క జ్ఞానమునకు ప్రధాన స్థానమును ఇచ్చి దానిని సర్వస్వంగా భావించి దానిని పొందుట కొరకై దేవుడిని ప్రార్థించి వేడుకున్నాడో అదేవిధంగా మనం కూడా దేవుడిని ప్రార్థించి విజ్ఞానాన్ని పొంది మంచి విశ్వాసులుగా జీవించాలి. 

ఈనాటి రెండవ పఠణంలో దేవుని యొక్క వాక్కు సజీవమైనది చైతన్యవంతమైనది అని తెలుపుచున్నది. ఆయన యొక్క వాక్కు మన జీవితంలో ఉన్నటువంటి చెడును తొలగిస్తుంది మనలో హృదయ పరివర్తన కలుగచేస్తుంది. ఆ విలువైనటువంటి దేవుని యొక్క వాక్కు కొరకు మనము తపించాలి. మన జీవితములను సరిచేసుకోవాలి. 

ఈనాటి సువిశేష పఠణములో ఒక యువకుడు నిత్యజీవితము పొందుటకు నేనేమి చేయాలి అని ప్రభువుని అడుగుతున్నారు. అందుకు తనను, ఏసుప్రభు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించమని తెలుపుతున్నారు ఆ యువకుడు అవి అన్నియు చిన్ననాటి నుండే పాటిస్తున్నాడని తెలిపారు. అప్పుడు ప్రభువు ఆయనకు తన దగ్గర ఉన్నటువంటి ధనము పేదలకు దానం చేసి ఇవ్వమని తెలిపారు కానీ అతడు దానికి ఇష్టపడలేదు. ఈ యువకుడు యొక్క ఉద్దేశ్యము నిత్య జీవము పొందుట మరి ఆ ఉద్దేశం కొరకు ఎందుకు ఆయన తన దగ్గర ఉన్నటువంటి ధనమును విడిచిపెట్టలేదు? ఈ యువకుడు ధనమే ముఖ్యమని భావించాడు. 

ధనము ఉన్న ఎడల తనకు మంచి గౌరవము అదే విధముగా తన భవిష్యత్తు బాగుంటుందని భావించాడు అందుకే ధనానికి ప్రాముఖ్యతను ఇచ్చి దానిని విడిచిపెట్టడానికి సిద్ధపడలేదు. వాస్తవానికి ధనపేక్ష అన్నది సర్వ అనర్ధాలకు మూలం. ఈ యువకుని యొక్క హృదయం ధనాశతో నిండి ఉన్నది కాబట్టి దానిలో దేవునికి స్థానము ఇవ్వలేదు. ధనాపేక్ష అతని పట్టి పీడిస్తుంది. ఈయొక్క ధనం వలనే ఆయన ఉదార స్వభావిగా జీవించి లేకపోయాడు. ఈ యొక్క యువకుడు తన యొక్క జీవితంలో ధనం కన్నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని భావించినట్లయితే ఆయన మీద ఆధారపడి జీవించేవాడు, ఆయనకు నిత్యజీవం లభించేది కానీ ఈ యొక్క యువకుడు దేవుని కన్నా ధనానికే ప్రాముఖ్యతనిచ్చి జీవించాడు అందుకనే విలువైన నిత్య జీవితాన్ని కోల్పోయాడు. ఈ యువకునికి దేనికి ప్రాముఖ్యత నివ్వాలో, దేనిని కలిగి జీవించాలో తెలుసుకోలేక పోయాడు అందుకే తన జీవితంలో సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఏసుప్రభు తన కొరకు ఎవరైతే సమస్తము విడిచిపెడతారో వారు నూరంతలుగా ఆశీర్వాదం పొందుతారని తెలిపారు (మార్కు 10:28-31). ఈ విషయాన్ని ఆ యువకుడు మరిచిపోయారు. మన యొక్క జీవితంలో దేవునికి విలువ నుంచి జీవించాలి అప్పుడు దేవుడు మనకు సమస్తము కూడా సమకూర్చును.
Fr. Bala Yesu OCD

28వ సామాన్య ఆదివారం

 

28వ సామాన్య ఆదివారం

సొలొమోను జ్ఞానం గ్రంధం 7:7-11
హెబ్రియులు 4:12-13
మార్కు 10:17-30 

క్రీస్తునాదునియాందు ప్రియా సహోదరి సహోధులరా, ఈనాడు మనమందరం కూడా సామాన్య కాలపు ఇరవై ఎనిమిదవ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈనాటి మూడు పఠనలను శ్రద్దగా గమనించినట్లయితే, మూడు పఠనలు కూడా ఆధ్యాత్మిక జీవితంలో నిజమైన సంపద, జ్ఞానం మరియు దేవుని వాక్యానికి సంబంధించిన గొప్పతనాన్ని గురించి వివరిస్తాయి. ఎందుకంటే సొలొమోను జ్ఞానగ్రంధంలో జ్ఞానాన్ని భౌతిక సిరి సంపదల కంటే గొప్పగా భావించడం చూస్తున్నాము, రెండవ పఠనంలో హీబ్రీయులకు వ్రాసిన లేఖలో దేవుని వాక్యం, మన జీవితాలను మర్చి పరిశీలించగల శక్తి గురించి చూపిస్తుంది. చివరిగా సువిశేష పఠనములో యేసు ధనవంతులకున్న సవాళ్లను ప్రస్తావించి, *వారినందరిని కూడా హెచ్చరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో సంపదకు నిర్బంధం వద్దని* తెలియజేస్తున్నాడు. 

ముందుగా మొదటిపఠనమును ద్యానించినట్లయితే, సొలొమోను జ్ఞానగ్రంధంలో చూస్తున్నాము, సొలొమోను తన జీవితంలో జ్ఞానాని ఏవిధంగా దేవుని దగ్గరనుండి పొందడో మరియు దాని విలువ ఎంత గొప్పదో చెప్పే వాక్యాలను చూస్తున్నాము. ఈ గ్రంథంలోని ఈ యొక్క భాగం మనకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక గుణ పాఠాన్ని నేర్పిస్తుంది. సత్యమైన జ్ఞానం లేదా బుద్ధి అనేది దేవుని నుండి లభించేది, మరియు అది భౌతిక సంపదల కంటే చాలా ఇలువైనది మరియు చాలా గొప్పది. ఎందుకంటే, 7:7 లో సొలొమోను జ్ఞానం కోసం ప్రార్థించాను అని చెబుతుంటాడు. దీనిలోని సారాంశం ఏమిటంటే మనం నిజమైన జ్ఞానాన్ని పొందడానికి దేవుని మీద ఆధారపడి జీవించాలి, ఆవిధంగానైతే సొలొమోను తనను తాను తగ్గించుకొని దేవుని మందట మొకరించి భక్తి విశ్వాసలా తోటి జ్ఞానం కోసం, దేవుని దగ్గర ప్రార్థించడం వలన దేవుడు అతని ప్రార్థనను ఆలకించి, తన యొక్క కృపను అయనపై కుమ్మరించి దివించటం చూస్తున్నాము. సొలొమోను తాను పొందినటువంటి జ్ఞానాన్ని గురించి ఎంతో విలువైనదిగా చెప్పడం చూస్తున్నాము, ఎందుకంటే బంగారమును జ్ఞానముతో సమానంగా చూడలేము, సొలొమోను సంపద మరియు భౌతిక వసతులకంటే అయన పొందినటువంటి జ్ఞానం చాలా గొప్పదిగా మరియు విలువైనదిగాను స్పష్టం చేసి యున్నాడు. దీనిని మనం ఒక ఉదాహరణగా  తీసుకుంటె మన జీవితంలో నిజమైన సంపద అనేది దేవుని జ్ఞానములోనే ఉందని గుర్తుచేస్తుంది.

రెండొవ పఠనములో హెబ్రీయులకు వ్రాసిన లేఖలో 4:12-13 రెండు వాక్యాలు, దేవుని వాక్యానికి మరియు దాని శక్తికి సంబంధించినవిగా కనిపిస్తున్నాయి. ఈ వాక్యాలు మన ఆధ్యాత్మిక జీవనంలో గంభీరమైన ప్రభావాన్ని చూపుతాయి.
ఇది కేవలం ఒక మానవ జ్ఞానానికి సంబంధించినది కాదు, దేవుని వాక్యం మన హృదయంలో ఉన్న అత్యంత ఆంతరంగిక భావాలను కూడా పరిశీలించగలిగేది. ఇది మన ఆత్మను మరియు మన జీవితాన్ని పరిశీలించి దేవుని ముందు మన జీవితం ఏవిధంగా ఉందొ తెలియజేస్తుంది. ఎందుకంటే 
దేవుని దృష్టిలో ఏది కూడా దాచబడదు, ఎందుకంటే మనకు దేవుని న్యాయ స్థానం ముందు, మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలో స్పష్టతనిస్తుంది. పాపమును మనం దాచుకోవాలనుకున్నా, దేవుని కళ్లకు అది దాగదని ఈ వాక్యం గట్టిగా హెచ్చరిస్తుంది. కాబట్టి, దేవుని ముందు మనము నిజాయితీగా, పవిత్రంగా ఉండేలా మన మనసును పరిశీలించుకోవాలి.
దేవుని వాక్యం మనలోని లోతులు, మనసు, ఆత్మ, మరియు ఆలోచనలను పరిశీలించుకోవడానికి ఒక పిలుపుగా ఉన్నాయి.

చివరిగా సువిశేష పఠనము మార్కు 10:17-30 వచనలలో యేసు మరియు ఒక ధనవంతుడు మధ్య సంభాషణను గురించి చూస్తున్నాము. ఒక ధనవంతుడు యేసు వద్దకు వచ్చి నేను నిత్యజీవం పొందడానికి ఏం చేయాలి? అని ఆడిగినప్పుడు. యేసు ముందుగా ఇచ్చినటువంటి సమాధానం ఆజ్ఞలను పాటించాలని చెబుతాడు, కానీ ధనవంతుడు అన్నీ పాటించానని అంటాడు. దీంతో యేసు అతనికి తన ధనాన్ని పేదలకు ఇచ్చి, స్వర్గంలో నిధులు సొంతం చేసుకోవాలని చెప్పాడు. అయితే, ఆ ధనవంతుడు తన ఆస్తిని విడిచిపెట్టలేక బాధతో వెళ్ళిపోయాడు. ఇక్కడ యేసు ధనవంతులకు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం అని చెబుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలరా మన జీవితంలో ఇది భౌతిక సంపదలను మనం ఎక్కువగా ప్రేమ చూపిస్తే, ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టడం కష్టం అవుతుందని సూచిస్తుంది. ఆస్తి మన మనసును దేవుని నుండి దూరం చేయగలదని తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా గమనించలి ఎందుకంటే పేతురు మరియు ఇతర శిష్యులు తమ జీవితాలను యేసు కోసం విడిచిపెట్టినట్లు అని యేసుతో చెప్పినప్పుడు, యేసు వారికి ఒక గొప్ప భరోసాను ఇస్తున్నాడు, అదేమిటంటే ఇహలోకంలోనే వారు ఆశీర్వాదాలు పొందుతారు అని మరియు పునరుత్థానంలో నిత్యజీవం వారికి ఉంటుందని చెప్పారు. 
ప్రియా దేవుని బిడ్డలరా మన జీవితాలలో కూడా దేవుని జ్ఞానం, వాక్యం మరియు నిత్య జీవితం అనేవి ఎంతో గొప్పవి కాబట్టి మనం వాటి కొరకై దేవునితో సంఖ్యత కలిగి జీవించాలని ఈ పూజ బలిలో ప్రార్దించుకుందాము. 
Fr. Johannes OCD

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

 

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము 

ఆదికాండము 2:18-24
హెబ్రీయులకు 2:9-11
మార్కు 10:2-16

క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డలరా, ఈనాటి మూడు దివ్య గ్రంథ పఠనలను మనం గ్రహించినట్లయితే, మూడు పఠనాలు కూడా మనకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక బోధనలు లేదా అంశాలను అందజేస్తున్నాయి. 
ఈ మూడు పఠనలు కలిసి మనకు దేవుని త్యాగం, సంకల్పం మరియు శాంతి జీవనానికి కొన్ని గొప్ప మార్గదర్శకత్వలను ఇస్తున్నాయి. 

          త్యాగం అంటే ఏమిటి బైబిల్ ప్రకారం మనం చుసినట్లయితే త్యాగం అనేది. బైబిల్లో దేవుని త్యాగం అనేది మానవ జాతి పట్ల అయన మహోన్నతమైన ప్రేమ, కరుణ, మరియు రక్షణకు సంబంధించిన ఒక మహత్తర అంశం. ఈ త్యాగం ఎవరైతే పాపం మరియు దేవుని నుండి దూరమైనా మానవుని తిరిగి దేవుని చెంతకు తీసుకురావడం కోసం చేయబడింది. దేవుని త్యాగం అనేది ప్రధానంగా యేసు క్రీస్తు ద్వారా పరిపూర్ణతకు చేరింది. ఎందుకంటే అత్యంత పావనమైన మరియు పవిత్రమైన అంశం కాబట్టి. యేసు క్రీస్తు తన జీవితాన్ని మన కోసం అ సిలువపై అర్పించడం ద్వారా మనకు నిత్యజీవం పొందే మార్గాన్ని ఏర్పరచాడు. అయన త్యాగం ద్వారా మనకు దేవుని ప్రేమను, క్షమను, మరియు అనంతమైన రక్షణను తీసుకోని వచ్చియున్నాడు. ముందుగా మొదటి పఠనములో చుసినట్లయితే దేవుడు తన త్యాగం, ప్రేమ ద్వారా మానవుని ఆవిధంగా సృష్టించరో మనమందరము కూడా మొదటి పఠనంలో చూడవచ్చు. 

ఆదికాండము 2:18-24 వచనలలో దేవుడు సృష్టించినటువంటి సృష్టి యొక్క ముఖ్యమైనటువంటి భాగాన్ని మనం చూస్తాము. దేవుడు మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పియున్నారు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనుషుల మధ్య ఉండవలసిన్నటువంటి సంబంధాలను, మరి ముఖ్యంగా దాంపత్య జీవితానికి లేదా బంధానికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నారు.

 దేవుడు ఆదామునకు కావలసినటువంటి తోడుని లేదా తనలో సగం భాగంగా ఉండవలసినటువంటి సహాయకురాలిని సృష్టించాలని దేవుడు నిర్ణయించుకున్నారు. దేవుడు సృష్టించిన ప్రతి జీవిని ఆదాముకు జతగా చుస్తే, ఆడాముకు అంటే ఆయనకు ఒక సహచరుడిగా ఎవరూ సారిపోలేదు. ఇక్కడ నుండి మనం నేర్చుకోవలసినది ఏమిటంటే మన జీవితంలో ఉన్న సంబంధాలు దేవుని సంకల్పం ప్రకారం ఉండాలి, అవి మనకీ సమానంగా ఉండాలి. ఆలా ఉండాలి కాబ్బటే దేవుడు ఆదాముని నిద్రించలాగా చేసి అతని శరీరం నుండి ఒక ఎముక తీసి స్త్రీని సృష్టించారు. ఇక్కడ, స్త్రీను పురుషుని ఎముక నుండి తీసుకోవడం యొక్క అర్థం ఏమిటంటే, స్త్రీ మరియు పురుషుడు ఒకరికి ఒకరు సమానంగా ఉండాలని. ఇద్దరూ ఒకరిని ఒకరు కలిసినప్పుడు ఏక శరీరముగా ఉండటం అనేది దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే దేవుడు వీరిద్దరిని కూడా ఒక్కటిగా చేసెను అని చెప్పడానికి గుర్తు. వివాహం అనేది కేవలం శారీరక సంబంధం కాదని అది ఒక ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైన కలయిక అని అర్ధం చేసుకోవాలి. ఈ వచనల ద్వారా మనం ప్రధానమైనటువంటి విషయాలను గ్రహీంచాలి.

1. పురుషునికి సహాయకురాలి అవసరం ఉండాలి.
2. ఇద్దరి మధ్య సమానత్వం అనేది ఉండాలి.
3. ఇద్దరు కూడా ఒక్కటిగా జీవించాలి.

అందువల్ల ఈ వాక్యం ద్వారా సృష్టి యొక్క గొప్పతనం, బంధం యొక్క పవిత్రత, అనుబంధం యొక్క ప్రాముఖ్యతను గురించి మనకు మొదటి పఠనం తెలియజేస్తుంది.

            రెండొవ పఠనము హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2:9-11 వచనలలో యేసు ప్రభువు మన కోసం త్యాగాన్ని స్వీకరించినట్లు మనకు తెలియజేస్తుంది. యేసు దేవుని మహిమతో ఉన్నప్పటికీ, తనను తానే తాగించుకొని,ఈ యొక్క లోకానికి వచ్చి, మన కోసం మానవ రూపాన్ని ధరించి, ఆయన మన పాపాలను తన బుజాలపై మోసి, మనకు శాశ్వతమైన విముక్తిని అందించడానికి సిలువపై అవమానకరమైనటువంటి మరణాని మరనించాడు. ఈ త్యాగం ద్వారా మనం దేవుని కుటుంబంలో ఒక భాగమయ్యాము. అందువల్ల, ఈ వాక్యం మనకు యేసు ప్రేమ మరియు కరుణను గురించి తెలియజేస్తుంది అని రెండొవ పఠనం చెబుతుంది.

                చివరిగా సువిశేష పఠనమును ద్యానించ్చినాట్లయితే మార్కు 10:2-16 వచనలలో యేసు వివాహం మరియు పిల్లల విషయంలో ముఖ్యమైనటువంటి సూత్రాలను ప్రజలకు బోధిస్తున్నాడు. యూదులలో విడాకుల ప్రస్థావన వచ్చినప్పుడు యేసు దేవుని ఆరంభ సంకల్పం వైపు దృష్టి తీసుకెళ్ళి, వివాహం అనేది దైవిక కట్టుబాటుగా, స్త్రీ పురుషులు విడిపోకూడని సంబంధంగా చెబుతున్నాడు. ఎందుకంటే పెళ్లి అనే బంధం దేవుని ఆశీస్సులతో ప్రారంభమవుతుంది, కాబట్టి దానిని పవిత్రంగా ఉంచుకోవాలని క్రీస్తు ప్రభు అంటున్నారు. అదేవిదంగా పిల్లల విషయానికి వస్తే, యేసు పిల్లలను దగ్గరగా తీసుకోని, వారి మనస్సు వాలే దేవుని రాజ్యానికి చేరాలి అని చెప్పాడు. పిల్లల ద్రుష్టి, శ్రద్ధ మరియు నమ్మకాన్ని గుర్తించి, మనం కూడా దేవుని వైపు పిల్లలవలే విశ్వాసంతో నడవాలని గుర్తుచేస్తున్నాడు.

        కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా మన జీవితాలలో బంధం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి దేవునికి ఇష్టనుసరంగా జీవించాలని భక్తి విశ్వాసల్లతోటి ప్రార్థించుకుందాము. 


ఈ మూడు వచనాలు కలిసి మనకు దేవుని సంకల్పం, త్యాగం, మరియు శాంతియుత జీవనానికి సంబంధించిన గొప్ప మార్గదర్శకతలను అందిస్తాయి.
Fr. Johannes OCD 

27 వ సామాన్య ఆదివారం

 

27 వ సామాన్య ఆదివారం 

ఆది కాండం 2:18-24, హెబ్రీ 2:9-11, మార్కు 10:2-16

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు "పరిశుద్ధ వివాహం" గురించి బోధిస్తున్నాయి. కుటుంబం అనేది ప్రభువును యొక్క ఉద్దేశంలో సృష్టి ప్రారంభం నుండి ఉన్నది. దేవుడు ఏర్పరచినటువంటి దివ్య సంస్కారాలలో మొదటిగా ఏర్పరచిన దివ్య సంస్కారము ఈ యొక్క వివాహ జీవితం ఎందుకనగా సృష్టి ఆరంభంలోనే స్త్రీ పురుషులు ఇద్దరిని సృష్టించి వారిని 
పవిత్ర వివాహము ద్వారా ఒకటి చేశారు. 

ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఆదాముకు అవ్వమ్మను తోడుగా ఇచ్చిన అంశమును చదువుతున్నాం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆయనకి తోడుగా ఉండుటకు, సహాయం చేయుటకు, తన కష్ట కాలములో, సంతోష సమయంలో, అండగా -నీడగా నిలబడటం నిమిత్తమై ఆదాము కొరకు అవ్వను ప్రభువు ఇస్తున్నారు. దేవుడు ఈ సృష్టిలో ఒక కుటుంబమునకు ప్రాముఖ్యత నుంచి ఆ కుటుంబమును ఏర్పరచుటకు సిద్ధపడ్డారు ఎందుకనగా కుటుంబమే అన్నిటికీ ప్రధానం. 

కుటుంబం నుండి అందరూ (గురువులైన, కన్య స్త్రీలైనా రాజకీయ నాయకులైనా, వైద్యులైనా ......) వస్తారు కాబట్టి ఆ కుటుంబం మంచిదైన యెడల ఈ ప్రపంచమే మంచిదిగా మారును అనే ఉద్దేశంతో ప్రభువు  బహుశా ఈ నిర్ణయం తీసుకున్నారేమో. దేవుడు సృష్టించినటువంటి ఆది తల్లిదండ్రులు ఇద్దరు ఒకరితో ఒకరు సగభాగమై, కలిసిమెలిసి జీవించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఆదాము యొక్క ప్రకటి ఎముకను తీసుకొని అవ్వను చేసిన సందర్భంలో ఆదాము ఈ విధంగా అంటున్నారు ఈమె నా ఎముకలో ఎముక, నాదేహంలో దేహం ఈమె నా వంటిదైనది అని పలికారు. దాంపత్య జీవితంలో ఇద్దరు వేరు వేరు చోట్ల జన్మించినటువంటి వారు ఒకటిగా అవ్వాలి అన్నది దాంపత్య జీవితం ప్రణాళిక.

 ప్రతి భార్య తన భర్త లాగా మారాలి అదేవిధంగా ప్రతి భర్త తన భార్య లాగా మారాలి. అందుకే ప్రభువు అంటున్నారు వివాహ బంధం ద్వారా భిన్న శరీరులుగా ఉన్న ఇద్దరూ ఏక శరీరులై జీవించబోతున్నారు. వివాహ బంధం అన్నది దేవుడు ఏర్పరిచిన బంధం. ఒక స్త్రీకి భర్తను అదే విధంగా ఒక పురుషుడికి భార్యను జత చేసేది దేవుడే ఎందుకనగా సృష్టి ప్రారంభంలోనే ఆదాముకు అవ్వే భార్యని దేవుడు వారిద్దరినీ జత చేసారు. ఆది తల్లిదండ్రులకు అంతయు క్రొత్తగా ఉన్నప్పటికీ వారిద్దరూ చివరి వరకు కలిసిమెలిసి జీవించారు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ప్రభువే స్వయంగా పలికారు ఎందుకన ఒంటరితనం బాధిస్తుంది, ఒంటరితనం మగవారు తట్టుకోలేరు అందుకే చాలా సందర్భాల్లో చూస్తాం ఒక భర్త చనిపోయినప్పుడు భార్య జీవించగలదు కానీ ఒక భార్య చనిపోయినప్పుడు భర్త దాన్ని తట్టుకొని జీవించటం చాలా కష్టం.

వివాహ జీవిత ముగింపు అనేది కేవలం మరణం ద్వారా సంభవించాలి కానీ విడాకులు అనేవి వివాహ జీవితంలో లేవు అని ప్రభువు స్పష్టం చేశారు. పరిసయ్యులు ఏసుప్రభువుని "భార్యను భర్త పరిత్యజించుట ధర్మమా అని ప్రశ్నించారు" ఎందుకంటే మోషే వారికి భార్యను పరిత్యజించే నియమము ఇచ్చారు కాబట్టి. మోషే చట్టం ప్రకారము ఒకవేళ భార్య అపరిశుద్ధముగా ఉన్నట్లయితే విడాకులు ఇవ్వవచ్చని రాయబడి ఉన్నది ఇక్కడ అ పరిశుద్ధత అంటే ఒక విధముగా భార్య వ్యభిచారిని అయ్యి ఉండవచ్చు రెండవదిగా అపరిశుద్ధత అనగా భార్య తన జీవితంలో భర్త మాట వినకపోవడం, వంట సరిగా చేయకపోవడం, పరాయి పురుషులతో మాట్లాడటం, భర్త యొక్క బంధువులతో అమర్యాదగా మాట్లాడటం ఇవన్నీ కూడా ఆమె యొక్క అపరిశుద్ధతకు సూచనగా ఉన్నాయి. ఇలాంటి విపరీతార్ధాలు ఉండటం వలన యూదా ప్రజలలో విడాకులు ఎక్కువైనాయి. భర్తలు,భార్యలపై ఏదో ఒక సాకుమోపి విడాకులిచ్చేవారు వైవాహిక జీవితం ఇట్టి దుస్థితికి దిగజారి పోవటం వలన వివాహ జీవితం అద్వానంగా మారేది అందుకని స్త్రీలు వివాహమాడుటకు వెనుకంజ వేసేవారు. 

ఏసుప్రభు మాత్రము వివాహ బంధము విడదీయని బంధము అని స్పష్టము చేశారు అందుకే ప్రభువు అంటున్నారు దేవుడు జతపరిచిన జంటను మానవమాత్రుడు వేరుపరపరాదని. దేవుని దృష్టిలో విడాకులకు తావులేదు కానీ మానవులే స్వార్థం కోసం బలహీనత వలన విడాకులు తీసుకుని దైవ ప్రణాళికకు విరుద్ధంగా జీవిస్తున్నారు.

వివాహ జీవితంలో కష్టాలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి బాధలు ఉంటాయి కానీ అన్ని సందర్భంలో ఒకరికి ఒకరై తోడై ఉండాలి అది దేవుడు వివాహ జీవితం ద్వారా నేర్పిస్తున్న అంశం. వివాహం రోజున భార్యాభర్తలిద్దరూ కూడా దేవుని ముంగిట కష్టములోనూ సుఖములోనూ వ్యాధి లోను సౌఖ్యములోనూ నేను నీకు ప్రామాణికంగా ఉందునని ఇద్దరు కూడా ప్రమాణం చేస్తారు. కాబట్టి ఆ ప్రమాణం యొక్క అర్థమును ఎప్పుడూ కూడా గ్రహించి ఇద్దరు కూడా కలిసిమెలిసి చివరి వరకు జీవించాలి. వివాహ బంధము పరలోకమునకై ఏర్పరచబడినది. Marriages are not made in heaven but marriages are made for heaven. ఈ సత్యమును గ్రహించి దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు ఒకరి ఎడల ఒకరు విశ్వాస పాత్రులుగా జీవిస్తూ, పరస్పరం క్షమించుకుంటూ, అర్థం చేసుకుంటూ, ప్రేమించుకుంటూ జీవిస్తే వారు చివరి వరకు సంతోషంగా ఉంటారు.
Fr. Bala Yesu OCD

సామాన్యకాలపు ఇరవై ఆరోవ ఆదివారం

 

సామాన్యకాలపు ఇరవై ఆరోవ ఆదివారం 

సంఖ్యకాండము 11:25-29, యాకోబు 5:1-6 
మార్కు 9:38-43, 45, 47-48.

క్రీస్తునాధునియయందు ప్రియ సహోదరి  సహోదరులారా మరియు  ప్రియమైనటువంటి భక్తులరా, ఈనాటి మూడు పఠణాలను మనం గ్రహించి ధ్యానిస్తే,  మూడు పఠణాలు కూడా మనకు తెలియజేస్తున్నా అంశం ఏమిటంటే, మూడు  ప్రధానమైనటువంటి విషయలను గురించి మనకు క్లుప్తంగా వివరిస్తున్నాయి, అవి ఏమిటంటే దేవుని కృప, అయన తీర్పు మరియు మన తప్పులను సరిదిద్దుకోని. దేవుని బాటలో ప్రయాణిస్తూ, మనం చేసినటువంటి పాపాలను వదలిపెట్టి, ఇతరులను ప్రేమతో దేవుని చెంతకు తీసుకోని రావాలని ఆహ్వానిస్తున్నాయి.

ముందుగా దేవుని కృప, తీర్పు మరియు మన తప్పులను సరిదిద్దుకోవడం అంటే ఏమిటి అని మనం ముందుగా గ్రహించాలి. అసలు దేవుని కృప అంటే ఏమిటి.
దేవుని కృప అనేది మనం సాదించుకోలేని, సంపాదించుకోలేని దివ్యమైనటువంటి లేదా పవిత్రమైనటువంటి వరం. ఈ వరం  మనకందరికీ కూడా దేవుని ప్రేమ, కరుణ మరియు పాపముల నుండి విముక్తి పొందే వరం. బైబిల్ గ్రంథ ప్రకారం దేవుని కృపకు సంబంధించిన ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు ఉన్నాయి. వాటి ద్వారా మనం దేవుని కృప ఏ విధంగా మన  జీవితాలను మారుస్తుందో అర్థం చేసుకోవచ్చు.

 రో్మీయులకు వ్రాసిన లేక 5:8 వచనంలో చూస్తున్నాము.మనము పాపులమై యుండగా క్రీస్తు మన కోసము చనిపోయెను. ఈ వాక్యము మనకు దేవుని కృపను ఆవిధంగా మనపై ఉందొ తెలియజేస్తుంది. మనం పాపులమై ఉండి దేవుని నుండి దూరంగా ఉన్నప్పటికీ కూడా క్రీస్తు మనకోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనందరి కోసం తాను ప్రాణత్యాగం చేశాడు. ఈ కృప మన బలహీనతల మధ్యన, దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మనతో ఉందని గుర్తుచేస్తుంది. 

అందుకే 2 కొరింథీయులకు  వ్రాసిన లేక 12:9 వచనంలో క్రీస్తు ప్రభు అంటున్నారు. నా కృప నీకు సరిపడును. అంటే ఈ వాక్యము దేవుని కృపను మరింత స్పష్టంగా వివరిస్తుంది. మన బలహీనతలలోనూ, సమస్యలలోనూ, దేవుని కృప మనకు ఆధారంగా నిలుస్తుంది. అది మనకు అర్హత లేకున్నా కూడా దేవుడు మన మీద చూపించే దయ మరియు అయన కృప మన పాపాలకు క్షమాపణ ఇచ్చి కొత్త జీవితని అందిస్తుంది. దేవునితో సన్నిహిత సంబంధాన్ని అందిస్తుంది. అదే నిజమైన క్రైస్తవుని యొక్క జీవితం.

 మొదటి పఠనని చుసినట్లయితే దేవుడు ఇజ్రాయెల ప్రజలను ఏవిధంగా బానిసత్వ జీవితం నుండి దేవుడు తన ప్రజల పట్ల చూపించినటువంటి కృపను తెలియజేస్తుంది. వారు చేసినటువంటి తప్పులను క్షమించి వారిపై తన కృపను ఎంతగానో చూపిస్తూ, వారిని అన్ని కష్టాలనుండి కాపాడుతు, వారికీ వచ్చినటువంటి కష్టాలను దూరం చేస్తూ, వారికీ అన్ని మేలులను దయచేస్తున్నారు. ఏ విధంగా అంటే తన ఆత్మ శక్తిని వారిపై పంపి తన కృపను అందజేస్తున్నాడు. అదేవిధంగా మన జీవితాలలో కూడా కష్టాలు వచ్చినప్పుడు, మనం కూడా అందరిలాగా దేవునిపై కోపం చూపించకుండా ఓపికతో ఎదురుచూసినట్లుతే అయన కృప ఎప్పుడు మనతో ఉంటుందని మొదటి పఠనం మనకు తెలియజేస్తుంది.

రెండొవ పఠనము యాకోబు వ్రాసిన లేక 5:1-6 లో దేవుడు ధనికులను హెచ్చరించడం గురించి చూస్తున్నాము అది ఏ విధంగా అంటే నీకు ఉన్నా సంపాదలను ని స్వార్ధం కొరకు ఉపయోగించకుండా ఇతరులకు మేలు చేసే విధంగా ఉపయోగించమని ఆలా ఉపయోగించడం ద్వారా దేవుని చేత ఆశీర్వాడింపబడతావని లేకపోతే దేవుని నుండి శిక్షను పొందుతావని మనకందరికి కూడా తెలియజేస్తున్నాడు, ఇక్కడ ఒక క్రైస్తవునిగా మనం చూడవలసిందేమిటంటే, మనం సర్వస్వాన్ని సంపాదించినా, అది దేవుని యోగ్యమైన విధంగా వాడకపోతే అది వ్యర్థమేనని చూసిస్తుంది. అది ఆవిధంగా అంటే లోకమంత సంపాదించి ఆత్మను కోల్పోయిన  లాభము ఉండదో అలాగే మనకు ఎన్ని ఆస్తిపాస్తులున్న అది దేవునికి ఇష్టనుసారంగా లేకపోతె ప్రయోజనము లేదు. ఎందుకంటే పాపాలు, అత్యాశ, ఇతరుల బాధలను పట్టించుకోకపోవడం వంటివి అన్నీ కూడా దేవుని ఖండనకు దారితీస్తాయి. కాబట్టి మన సంపదలను న్యాయంగా ఉపయోగించాలి, ఇతరుల పట్ల మనము దయ చూపించి ప్రేమను నా అనుకోని చూపించాలని రెండొవ పఠనం మనకి నేర్పిస్తుంది.
 
చివరిగా సువిశేష పఠనని గమనించినట్లయితే, క్రీస్తు ప్రభు 
 శిష్యులకు నేర్పించినటువంటి కొన్ని సత్యాలు మరియు ముఖ్యమైనటువంటి గుణపాఠాల గురించి  తెలియజేస్తుంది. అప్పుడైతే యోహాను యేసు దగ్గరకు వచ్చి యేసుతో మాట్లాడడో అప్పుడే, యేసు తన శిష్యులకు కొన్ని ముఖ్యమైన మరియు కీలకమైన సందేశాల్ని అందించాడు.  అది ఆవిధంగా అంటే పాపం ఎంత హానికరమో, దానితో మెలగడంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో పూస గుచ్చినట్లు స్పష్టంగా వివరించాడు.

మొదటిది ఇతరులను అంగీకరించడం ఎందుకంటే యోహాను యేసు దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు, ఒక వ్యక్తి మీ పేరిట దయ్యాలను వెళ్లగొడుతున్నాడు, అతను మనతో ఉండలేదు కాబట్టి మేము అతడు చేసేటువంటి పనిని మేము ఆపివేసితిమి అని చెప్పినప్పుడు. అందుకు క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం మనకందరికి కూడా అత్యునతమైన గుణపాఠాన్ని నేర్పిస్తుంది. యేసు అన్నాడు, ఎందుకంటే క్రీస్తు ప్రభు అంటున్నారు నన్ను విరోధించడం లేనివాడు మనకు అనుకూలం అని. ఇది మనకు ఏమి నేర్పిస్తుంది అంటే ఇతరులు దేవుని పట్ల చేసేటువంటి సేవాలను మనస్ఫూర్తిగా అంగీకరించడం అంతే కాకుండా వాళ్లు మన తోటి వారు కాకపోయినా దేవుని సేవ చేయడానికి వారిని మనం అంగీకరించడం ముఖ్యమని తెలియజేస్తుంది. మరి రెండొవది పాపం పట్ల దూరంగా ఉండటం (9:42-48) అంటే యేసు మనకు నేర్పిస్తున్నారు 

పాపం మన జీవితాలను ఏవిధంగా  నాశనం చేస్తుందో తెలియజేస్తున్నాడు. ఎలాగంటే నీ చెయ్యి నీకు పాపం చేయడానికి దారితీస్తే దానిని తెగనరుకుము, నీ కాలు లేదా కన్ను  నీకు విరుద్ధముగా పాపానికి దారితీస్తే దానిని తీసివెయుము అని అంటున్నారు యేసు ప్రభు. ఇక్కడ యేసు ఇచ్చిన సందేశం మనకు ఎంత ప్రాముఖ్యమైనదిగా గుర్తించాలి. ఎందుకంటే మొదటిగా పాపం మనకు ఆనందాని కలిగించవచ్చు, కానీ అది మన ఆత్మను మరియు మనకు దేవునితో ఉన్నటువంటి సన్నిహితని దూరం చేస్తూ, నాశనం చేస్తుంది. కాబట్టి యేసు చెప్పిన విధంగా మన జీవితంలో పాపం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని. మనకు ఎన్ని సోదనలు, కష్టాలు వచ్చినప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉండి అయన బాటలో నడవడానికి, అయన చేపినటువంటి మాటలను అలకిస్తూ జీవించాలని సువిశేష పఠనం మనలను హెచ్చరిస్తుంది. 

కాబట్టి ప్రియా సహోదరి సహోదలారా, ఈ నాటి మూడు పఠనలను కూడా మనం గుర్తుచేసుకుంటూ దేవుడు ఆవిధమైనటువంటి సందేశని మనకు ఇస్తున్నాడని మనం గ్రహించాలి. ఒక క్రైస్తవునిగా మనం జీవిత విధానం ఆవిధంగా ఉంది దేవునికి ఇస్టనుసారంగా ఉందా లేకపోతే మనకు ఇష్టమొచ్చినట్లు మనం జీవిస్తునామా అని ఆలోసించుకోవాలి. ఎందుకంటే దేవుని కృపను, అయన ప్రేమను పొందుకోవాలంటే. మనం అందరము కూడా దేవుని దారిలో నడుస్తూ, మన పాపాలను విడిచిపెట్టి దేవునికి దగ్గరగా అవాలని ప్రార్ధించుకుందాము.
Fr. Johannes OCD 

26వ సామాన్య ఆదివారం

 

 26వ సామాన్య ఆదివారం 

సంఖ్యా 11:25-29, యాకోబు 5:1-6, మార్కు9:38-43,45,47-48

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు అసూయ అనే అంశము గురించి బోధిస్తున్నాయి. సమాజంలో చాలామందికి తమ తోటి వారి పట్ల అసూయ భావం ఉంటుంది. అసూయ అనగా ఇతరుల యొక్క ఎదుగుదలను అభివృద్ధిని సహించలేక మనసంతా బాదించేది అసూయ. ఎదుటివారి గొప్పదనమును చూసి మనం కొన్ని సందర్భాలలో ఓర్వలేకుంటాం.

అసూయ అనేది కోపము, క్రూరము కంటే ఘోరమైనది సామెతలు 27:4. 
మనం జీవించేటటువంటి ప్రదేశంలో మనకన్నా గొప్పగా ఎవరైనా ఎదుగుతున్నారంటే మనందరం కూడా తట్టుకోలేక పోతాం. మన కన్నా అందంగా ఉన్నా, డబ్బున్నా, పేరు ప్రతిష్టలన్నా, వారిని చూసినప్పుడు మనలో అసూయ భావం కలుగుతుంది. ఈ యొక్క అసూయ వలన ఎప్పుడు మనము ఎదుటివారి గురించే ఆలోచిస్తాం దానివలన ప్రశాంతంగా జీవించలేం. అసూయ వలన మన యొక్క ఆయుష్షు తగ్గుతుంది. (సిరా 30:24.

చాలా సందర్భాలలో ఈ యొక్క అసూయ వలన పాపం చేస్తాం. మనం దేవునితో మంచిగా ఉంటే సైతాన్కు అసూయ, అందుకే మన జీవితంలో శోధనను ప్రవేశపెడుతుంటుంది. మనం కొంతమందితో మంచిగా మాట్లాడితే వేరే వారికి అసూయ ఉంటుంది. మనం కొన్నిసార్లు ఖరీదైన కార్లు కొన్నా, వస్తువులను కొన్నా కొంతమంది దానిని చూసి తట్టుకోలేరు.

ఈనాటి మొదటి పఠణంలో మోషే ఇశ్రాయేలు ప్రజలపై నాయకత్వం భారం కింద కృంగిపోయి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు యావే ప్రభువు అతనికి సహాయంగా ప్రజల పెద్దల నుండి 70 మందిని ఎన్నుకున్నారు వారిని గుడారం చుట్టూ నిలవమని చెప్పారు. మోషే దేవుడు చెప్పిన విధంగా చేశారు అంతట యావే దేవుడు మేఘం నుండి దిగివచ్చి మోషే మీద వచ్చిన ఆత్మలో కొంత ఆత్మను ఆ 70 మంది మీద ఉంచారు. ఆ ఆత్మను స్వీకరించినప్పుడు ఆ 70 మంది కూడా దేవుని వాక్యమును ప్రకటింప సాగారు. ఈ గుంపులో లేనటువంటి ఎల్దాదు, మేధాదు అనే ఇద్దరు వ్యక్తులు మీద కూడా వేరుగా ఆత్మ దిగి వచ్చి వారు కూడా ప్రవచింపసాగారు. గుడారం దగ్గర లేని ఇద్దరు మీదకు ఆత్మ దిగిరాగా, వారు ప్రవచించుట చూచి యెహోషువ వారిని అడ్డుకోవాలని భావించాడు అందుకు మోషే నీవు నా మీద ఉన్న ప్రేమ వలన అసూయపడుచున్నావు అని చెప్పారు.(సంఖ్యా11:29). దానికి ప్రత్యుత్తరముగా మోషే ప్రవక్త యెహోషువతో ఈ విధంగా అంటున్నారు దైవ ప్రజలందరూ ప్రవక్తలుగా మారి దేవుని సేవ చేయాలని దేవుని ప్రణాళిక.

 యెహోషువ, దేవుని యొక్క ఆత్మ ప్రవచన శక్తి, బోధనా శక్తి అందరి శ్రేయస్సు కొరకై ఇవ్వబడినది అని గ్రహింప లేకపోయారు. అసూయ పడుచున్నారు. ఈ యొక్క ప్రవచన శక్తిని కేవలము 70 మందికి మాత్రమే పరిమితం చేయాలని యెహోషువ భావించాడు. మోషే ప్రవక్త ఎటువంటి అసూయ పడకుండా అందరూ ప్రభువు సేవ చేయుట మంచిదే అని భావించారు. అందుకే తాను స్వీకరించినటువంటి ఆత్మను సైతం ఇతరుల కొరకు ఇవ్వటకు సిద్ధపడ్డాడు. తన గౌరవ ప్రతిష్టలు తగ్గిపోతాయని కానీ, తన అధికారం ఇతరులకు ఇవ్వడం ద్వారా తన నాయకత్వానికి హాని కలుగుతుందని మోషే భావించలేదు ఆయన అనుక్షణం ప్రజల యొక్క శ్రేయస్సునే కోరుకున్నారు. తన యొక్క పదవి గురించి భయపడలేదు.
 
కొన్ని సందర్భాలలో మనం కూడా యెహోషువలే తొందరపడి అసూయ చెందుతుంటాం. ఈ అసూయ వలన ఇతరులతో కూడా మాట్లాడటం మానేస్తాం. అసూయ వలన జరిగే కొన్ని నష్టాలు;
1. అసూయ మనలను నిరుత్సాహపరుస్తుంది (సామెతలు 23:17-18)
2. అసూయ మనల్ని కఠినులను చేస్తుంది (పరమగీతం 8:6)
3. అసూయ మనల్నీ confuse చేస్తుంది. (యాకోబు 3:16).
4. అసూయ మనకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది.

ఈనాటి రెండవ పఠణంలో ధనవంతులు చేస్తున్నటువంటి మోసము గురించి తెలుపుతున్నారు. వారు పేదవారిని కూలగొట్టి సంపాదించినటువంటి ధనము మొత్తము కూడా నాశనమవుతుంది అని యాకోబు గారు తెలుపుచున్నారు. ధనవంతులు పేదవారి పట్ల, తమ దగ్గర పని చేసే వారి పట్ల ప్రేమ భావం కలిగి జీవించాలి. ధనికులు, పేదవారిని చిన్నచూపు చూడకుండా వారి యెడల కనికర హృదయం కలిగి జీవించాలి. 

ఈనాటి సువిశేష భాగములో కూడా యోహాను, ఒక వ్యక్తి ఏసుప్రభువు పేరిటములను గూర్చి ప్రభువునకు ఫిర్యాదు చేస్తున్నారు అతడిని వెంటనే తన పరిచర్య నుండి నిషేధించాలని ఏసుప్రభువును కోరాడు. యోహాను కూడా యెహోషువలై తన యొక్క అసహనాన్ని, అసూయను వ్యక్తపరుస్తున్నాడు. ప్రభు అంటున్నారు "నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కాని వాడు" మన పక్షమున ఉండు వాడు (మార్కు 9:39-40) అని తెలిపారు. దేవుని వరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా అందించబడ్డాయి దానిని యోహాను గుర్తించలేకపోయారు.

కేవలము వారి వలె అద్భుతాలు చేస్తున్నారు అనేటటువంటి అసూయతోనే యోహాను ఏసు ప్రభువునకు ఈ విషయమును తెలియజేశారు. 

పవిత్ర గ్రంథంలో అసూయ గురించి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 
1. కయీను అసూయ వలనే సోదరుడిని చంపివేశాడు. (ఆది 4:3-8)
2. ఏసేపు యొక్క అన్నలు అసూయ వలనే ఆయన్ను బావిలో పడేశారు (ఆది 37:5-8)
3. మోషే గొప్పతనమును చూసి మిరియం అసూయ పడుతున్నది.
4. సౌలు దావీదు యొక్క కీర్తిని చూసి అసూయ పడుతున్నాడు. 
5. మెర్థుకయి కీర్తిని చూసి హామాను అసూయ పడుతున్నాడు.
6. హేరోదు రాజు కూడా బాల యేసుని చూసి అసూయ పడుతున్నాడు.
అదేవిధంగా ఈ యోహాను గారు కూడా అసూయ పడుతున్నారు. మన యొక్క జీవితంలో అసూయను విడిచి పెట్టేసి తోటి వారిని అంగీకరించి జీవించాలి అప్పుడే మనందరం కూడా సంతోషంగా జీవించగలుగుతాం. 

Fr. Bala Yesu OCD 

25 వ సామాన్య ఆదివారము

 

 25 వ సామాన్య ఆదివారము

సొలొమోను జ్ఞాన గ్రంధము 2 : 12 , 17 - 20 

యాకోబు 3 : 16 - 4 : 3 

మార్కు 9 : 30 - 37 

క్రిస్తునాధుని యందు ప్రియ సహోదరి సహోదరులారా !


ఈనాడు తల్లి తిరుసభ 25 వ సామాన్య కాలపు ఆదివారములోనికి ప్రవేశిస్తుంది.  ఈనాటి మూడు దివ్యగ్రంధ పట్టణాలు కూడా మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి అని ఆత్మపరిశీలన చేసుకోమని మనలను అందరిని కూడా ఆహ్వానిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే మన యొక్క బుద్ధి ప్రవర్తనలు ఏ విధంగా ఉంటున్నాయి అని మనలను మనము ప్రశ్నించుకోవలసిన సమయము. ఎందుకంటే ఈనాటి సువిశేష పఠనంలో మనము రెండు అంశాలను చూస్తున్నాము. యేసు ప్రభువు తన యొక్క శిష్యులకు తాను పొందబోయెటువంటి సిలువ మరణమును అటుపిమ్మట జరగబోయే పునరుత్తాన్ని గురించి ప్రభు తన యొక్క శిష్యులకు వివరిస్తూ ఉంటున్నారు. కానీ శిష్యులు మాత్రం మనలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. అంటే ఎవరు ప్రథముడు అని తమలో తాము వాదించుకుంటున్నారు. యేసు పలికిన మాటలను వారు గ్రహించలేక పోతున్నారు.

 ఆ సమయములో యేసు వారికి ఒక గొప్ప ఉదాహరణను చెప్పడానికి ఈ విధంగా వారితో పలుకుతున్నారు. (మార్కు 9 : 37 ) "ఇట్టి చిన్నబిడ్డలలో ఒకనిని స్వీకరించువాడు నన్నును స్వీకరించు వాడు అగును. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు"అని ప్రభువు పలుకుతున్నాడు. తమలో తం,యూ ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నవారికి ఒక గుణపాఠాన్ని ఒక చిన్న బిడ్డ ద్వారా వారికీ విశిదీకరిస్తున్నారు. అంటే చిన్న బిడ్డలు ఏ విధంగా అయితే ఒకరి పై ఆధారపడి జీవిస్తారో, నిర్మల మనసు కలిగి ఉంటారో, చెప్పిన మాటకు విధేయులై ఉంటారో, అలాగా మీరును మరీనా తప్ప మీలో ఎవడును  గొప్పవాడు కాదు అని ప్రభు వారికి తెలియచేస్తున్నారు. ఆ చిన్న బిడ్డలవలె మనము జీవించాలి అంటే మనము ఎం చేయాలి అంటే మన యొక్క జీవిత విధానాన్ని మనము మార్చుకోవాలి. ఎపుడు కూడా దుస్తుల వాలే కాకుండా నీతిమంతులుగా మనయొక్క జీవితాన్ని మనము గడపాలి. యేసు ప్రభువు తన యొక్క జీవితము ద్వారా మనకు మనము ఏ విధంగా జీవించాలి అని మనకు నేర్పిస్తూ ఉన్నారు. 

ఈనాటి మొదటి పఠనంలో మనము చూస్తున్నాము.యేసు ప్రభు తన యొక్క సిలువ మరణాన్ని గురించి సంబందించిన విషయములను మనము చూస్తున్నాము. సో. జ్ఞాన  2 : 18 -20  వచనాలలో మనము చూస్తున్నాము. క్రూరముగా అవమానింతుము, హింసింతుము, పరీక్షకు గురిచేయుదము, ఇతని సహన భావమెంత గొప్పదో పర్రెక్షించి చూతము అని యేసును గూర్చిన పలుకులను మనము చూస్తున్నాము. యేసు ప్రభు తనయొక్క సిలువ మరణము పొందెబోయే ముందు ఈ విధముగా అనేకమైన అవమానాలు, హింసలు, నిందలు పొందియున్నారు. కానీ చివరిగా యేసు పలికినటువంటి పలుకులు (లూకా 23 : 34 ) "తండ్రి వీరు ఏమిచేయుచున్నారో వీరికి తెలియడంలేదు, వీరిని క్షమించుము" అని వారిని క్షమించి వారికై ప్రార్ధన చేస్తున్నారు. మనము కుడి మన యొక్క జీవితంలో ఎపుడు కూడా  ఒకరి పట్ల కఠినంగా కాకుండా ప్రేమ కలిగి జీవించాలి అని ప్రభు తన యొక్క జీవితం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. 


ఒక మానవునిగా మన జీవితంలో అనేకమైన అవసరాలను మనము ఎదుర్కొంటు ఉంటాము. వాటిని మనము చేరుకోవాలి అంటే అనేకమైనటువంటి మార్గాలగుండా ప్రయాణిస్తాము. అది మంచిమార్గమే కానీ చెడు మార్గమే కానీ.   ఈనాటి రెండొవ పఠనంలో మనము చూస్తున్నాము మానవుల మధ్య కలహాలు అనేవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి? వాటికి గల కారణము ఎవరు? అసలు మనము చేయవలసిన పని ఏంటీ అని చూస్తున్నాము. యాకోబు 4:1 వచనంలో చూస్తున్నాము. మానవుల మధ్య అనేకమైనటువంటి భేదములు ఎలా పుడుతున్నాయి అంటే అది కేవలము మనలో ఉన్నటువంటి వ్యామోహములనుండి. అనేకమైనటువంటి కోరికలు, ఆశలు, ఆశయాలు ఉండడం ద్వారా వాటిని పరిపూర్తి చేసుకోవడానికి మన పొరుగువానికి హాని తలపెట్టడానికి కూడా మనము వెనుదిరగడంలేదు. అనేకమైన యుద్ధములు చేస్తున్నాం కానీ మనము చేయవలసిన పని మాత్రం చేయడంలేదు. ఏంటి అంటే మనకు కావలసిన వాటికోడం దేవునికి ప్రార్ధించడం లేదు. యాకోబు 4 : 2 -3  వచనాలలో మనము వింటున్నాం, మీరు కావలసినవి మీరు పొందలేక పోతున్నారు అంటే మీరు దేవునితో ఐక్యమై జీవించటంలేదు అని.  మనయొక్క జీవితంలో మనకు కావలసిన వాటిని కానీ కావలసిన వారిని గని మనము సంపాదించుకోవాలి అంటే అది కేవలము దేవునితో ఐక్యమై జీవించడం ద్వారా మాత్రమే అని  నంటే నీతిమంతమైన మార్గమున ఒక నీతిమంతునిగా మెలగడం ద్వారా జరుగుతున్నది. 

నీతిమంతుని యొక్క లక్షణాలను మనము చూస్తున్నాం. స్నాతి ప్రథముడిగా ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి, మృదుమనసు కలిగి ఉండాలి. అంటే ఒక మాటలో చేపల అంటే క్రీస్తు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా మనము కుడి ఉండాలి. కానీ మనము ఏ విధంగా ఉంటున్నాం? విభుంనమైనటువంటి స్వభావము కలిగి ఉంటున్నాం.సువిశేష పఠనంలో మనము చూస్తున్నాం. క్రీస్తు తరువాత తాను స్థాపించబోయే రాజ్యాన్ని తన శిష్యులు కొనసాగించాలి అన్న ఉదేశ్యముతో వారికి తనను గురించి తాను చెప్పుకుంటూ ఉంటే శిష్యులు మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. వారిలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. యేసును అర్ధంచేసుకోలేక ఉంటున్నారు.    

మరి మనము మన యొక్క జీవితంలో యేసును అర్ధం చేసుకొని జీవిస్తున్నామా ? తండ్రి దేవుని యొక్క ఆలోచనలను మనం అర్ధం చేసుకోవాలి అంటే ముందుగా మనము ఎం చేయాలి అంటే మనలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని తొలగించుకొని అందరితో కలిసి ఏకత్వంగ జీవించాలి. అందరికి భిన్నంగా ఉన్నట్లయితే మన జీవితంలో మనమే కలహాలు సృష్టించుకున్నవాళ్ళం అవుతాం. అలా కాకుండా అందరితో కలిసి ఉన్నట్లయితే మనము దేవుని చేరగలుగుతాం. తనయొక్క శిష్యులు ఆయనతో కలిసి ఉన్నప్పటికీ ఆయనను అర్ధం చేసుకొనలేకపోయారు. ఎందుకంటే వారి యొక్క ఆలోచన విధానం యేసుయొక్క ఆలోచనలకూ అతీతంగా ఉంటూ ఉన్నాయి. మనము కూడా కొన్నిసార్లు ఈ విధంగా దేవుని యొక్క ఆలోచనలకూ విభిన్నంగా ప్రవర్థిస్తూఉంటాం. కారణము  విధేయత లేకపోవడం. కాబట్టి మనము దేవునితో కలిసి జీవించాలి అంటే విధేయత కలిగి జీవించాలి. చిన్న బిడ్డల వాలే మారు మనసు కలిగి ఉండాలి.



ఎడిత్ స్టెయిన్ కార్మెల్ భవన్

జానంపేట 

 బ్రదర్. పవన్ కుమార్ ఓ. సి. డి

19, జనవరి 2026, సోమవారం

25 వ సామాన్య ఆదివారము

25 వ సామాన్య ఆదివారము 

సొలొమోను జ్ఞాన గ్రంధము 2:17-20, 
యాకోబు 3:16-18, 4:1-3
మార్కు 9:30-37

క్రీస్తునాధుని యందు ప్రియ సహోదరీ సహోదరులారా ఈనాటి మూడు పఠణాలను గ్రహించినట్లయితే మూడు పఠణాలు కూడా మనకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక బోధనలు లేదా అంశాలను ఇస్తున్నాయి.  అదేమిటంటే ధర్మంతో నిలబడటం నిజమైనటువంటి జ్ఞానాన్ని మరియు శాంతిని సూచించటం, అంతే కాకుండా దేవుని సేవ చేయడంలో నిజమైన గొప్పతనం ఏమిటో మనకందరికి కూడా క్లుప్తంగా వివరిస్తున్నాయి.
 ముందుగా మొదటి పఠణాని మనం గ్రహించినట్లయితే సొలోమోను జ్ఞాన గ్రంథము రెండవ అధ్యాయము 17 నుండి 20 వచనాలనలలో ధర్మాత్మునిపై లేదా పుణ్యాత్ములపై దుర్మార్గులు చేసేటువంటి కుట్రలు మరియు వారి వంకర బుద్ధులను చూపిస్తున్నాయి. వారు నిజమైన ధర్మాన్ని ద్వేషించటమే కాకుండా, ధర్మాన్ని పాటించే వారిని కూడా ఎగతాళి చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుని దూషించడమే కాకుండా దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచే వారందరిని కూడా వారు అవమాన పరుస్తున్నారు. ఇక్కడ ధర్మంతో కూడిన వ్యక్తిని మరియు అతని యొక్క నిజాయితీని కూడా పరీక్షించాలని పన్నాగం పొందుతున్నారు.
అంతేకాకుండా వారు మంచిగా జీవించే వ్యక్తులను,  వారి విశ్వాసాన్ని, వారికి దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకానికి వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే మంచివారిని నాశనం చేయాలని, దేవుని దూషించాలని చూస్తుంటారో వారందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడని మరియు మంచివాని పట్ల దేవుని దయ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ, దేవునికి దగ్గరగా నివసించే వారికి ఎప్పుడు కష్టాలు, బాధలు మరియు అవమానాలు వస్తూనే ఉంటాయి. అటువంటి సమయాలలో మంచివారు దేవునికి దగ్గరగా జీవించినట్లయితే కచ్చితంగా దేవుని చేత దీవించబడతాడు అని మొదటి పఠనం మనకు అందరికీ కూడా తెలియజేస్తుంది. మరి రెండవ పఠనని చూసినట్లయితే యాకోబు రాసినటువంటి లేక మూడవ అధ్యయం ముఖ్యంగా 16 వ వచనంలో చూస్తున్నాము. ఎక్కడైతే ఈర్ష మరియు స్వార్థం ఉంటుందో అక్కడ ఎప్పుడూ అల్లకల్లోలం ఉంటుంది.  అంతేకాకుండా చెడు పనులు,  చెడు వ్యసనాలు  ఉంటాయి, కానీ యాకోబు గారు ఏమి చెబుతున్నారంటే మనకు ఉండవలసినటువంటి మంచి జ్ఞానాన్ని గురించి వివరిస్తున్నాడు. దేవుని నుండి వచ్చే జ్ఞానం ఎంతో స్వచ్ఛమైనది ఎందుకంటే అది శాంతిని మరియు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇది క్రైస్తవుల మైనటువంటి మనకందరికీ కూడా ఒక గొప్ప గుణపాటాన్ని నేర్పిస్తుంది. ఎందుకంటే నిజమైన జ్ఞానం అనేది స్వార్థం, ఈర్ష మరియు అసంతృప్తితో కూడింది కాదు, కానీ జ్ఞానం అనేది ఎప్పుడు ఇతరుల మేలు కోరుకునేది. అంతేకాకుండా, ఎప్పుడు ఒకరికి మేలు చేసేదే కానీ కీడు చేసేది కాదు అని పునిత యాకోబు గారు మనకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. చివరిగా విశేష పఠణని గమనించినట్లయితే, ఏసుప్రభు శిష్యుల మధ్య వచ్చినటువంటి గొప్పతనం యొక్క చర్చల గురించి తెలియజేస్తుంది. గొప్పతనం అంటే మన గురించి మనం గొప్పలు చెప్పుకోవటం కాదు,  కానీ నేటి సమాజంలో మనం చూస్తూనము. మనం ఏదైనా ఒక చిన్న మంచి పని చేస్తే దాని పదిమంది దగ్గర గొప్పలు చెప్పుకుంటమో, అదేవిధంగా ఈనాడు శిష్యులు కూడా వారిలో వారు నేను గొప్పవాడిని నేను గొప్ప వాడిని అని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు, వారి మాటలను ఆలకించినటువంటి క్రీస్తు ప్రభువు వారితో ఈ విధంగా అంటున్నారు. ఒక చిన్న పిల్లవాని ఉదాహరణగా తీసుకొని అంటున్నాడు, మీలో ఎవరైనా గొప్పవాడు కాదల్చిన  వాడు ముందుగా సేవకుని వలే జీవించాలని, ఎప్పుడైతే నీవు సేవకుని వాలే జీవిస్తావో అప్పుడే నీవు గొప్పవాడిగా పరిగణింప పడతావని క్రీస్తు ప్రభు అంటున్నారు. ఎందుకు ఏసుప్రభువు ఈ విధంగా అంటున్నారు అంటే గొప్పతనం అనేది ఏమిటంటే కేవలం సేవ చేయటం. మరి ఈ సేవ చేయాలంటే మనలను మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే అలా మనలని మనం తగ్గించుకొని జీవించగలుగుతామో అప్పుడే మనం దేవుని చేత ఆశీర్వదించబడి గొప్పవాడిగా పరిగణింపబడతామని క్రీస్తు ప్రభువు సువిశేష పఠనంలో సెలవిస్తున్నాడు. 
కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా మన జీవితాలలో కూడా అనేకసార్లు తప్పుడు మార్గాలలో ప్రయాణించి, తప్పుడు ఆలోచనలతో జీవించి, నేనే గొప్పవాని అని బ్రతుకుతుంటాము, అటువంటి వారందరికీ కూడా ఈనాటి మూడు పఠణాలు ఒక గొప్ప గుణపాటాని నేర్పిస్తున్నాయి. కాబట్టి ఇప్పటినుండి దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని, ఎప్పుడు మంచినే ఎంచుకుంటూ ఉండాలని ఈ దివ్య బలి పూజలో భక్తి విశ్వాసాలతోటి ప్రార్థించుకుందాం.  ఆమెన్.

ఫా. జ్వాహాన్నెస్ OCD

24 సామాన్య ఆదివారం

24 సామాన్య ఆదివారం 

యెషయా 50: 4-9, యాకోబు 2:14-18, మార్కు 8: 27-35

ఈనాటి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క సేవకుల/ శిష్యుల జీవితం గురించి తెలుపుచున్నది. ప్రభువు యొక్క శిష్యులు ఏ విధంగా ఉండాలి అన్నది ప్రధానమైన అంశం. ఈనాటి మొదటి పఠణంలో యెషయా ప్రవక్త బాథామయ సేవకుని గురించి తెలియజేస్తున్నారు. ఈ యొక్క సేవకుని యొక్క గీతము ముఖ్యంగా మూడు అంశాలు చూస్తున్నాం. మొదటిగా దేవుడు సేవకుని ఎన్నుకొనుట. 

రెండవదిగా సేవకుడు తన యొక్క జీవితమును సేవ కొరకు త్యాగం చేయుట.
మూడవదిగా, ఏ విధముగా దేవుడు తనను ఆపదల నుండి కాపాడతారు అంశమును తెలుపుచున్నారు. తండ్రి తన సేవకుని ఎన్నుకొని, బోధించుటకు  కావలసినటువంటి అనుగ్రహమును దయ చేస్తున్నారు. ఈ యొక్క సేవకుడు తన యొక్క పరిచర్య జీవితంలో అనేక రకములైనటువంటి నిందలు భరించవలసి ఉంటుంది అయినప్పటికీ వాటిని ధైర్యంతో దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతూ భరించారు. అన్యాయంగా ఆయనను బాధించినప్పటికీ, నేరము మోపినప్పటికీ ఆయన మాత్రం అన్నిటినీ మౌనంగా భరించారు ఎందుకనగా చివరి రోజును తన తరపున దేవుడు పోరాడుతారు అని నమ్మకం. ఈ సేవకుని గీతం ఏసుప్రభు యొక్క జీవితమునకు అక్షరాల వర్తిస్తుంది. మెస్సయ్య కొరకే ఈ యొక్క గీతము రాయబడి ఉన్నది. ఏసుక్రీస్తు ప్రభువు ఏ విధముగా శ్రమలను అనుభవించి మరణించబోతున్నారో, ఆయన పరిచర్య ఎలా సాగినదో, ఎలాగ తండ్రి మీద ఆధారపడ్డారో అంతయు కూడా ఈ గీతం ద్వారా అర్థమవుచున్నది.
ఈ మొదటి పఠణం ద్వారా మనం గ్రహించవలసిన సత్యము ఏమిటంటే.బాదామయ సేవకుడు ఏ విధముగానయితే తాను తన యొక్క బాధ్యతను నెరవేరుస్తూ తన ప్రాణములను త్యాగం చేశారో మరియు దేవుడు తనకు సహాయం చేస్తారని నమ్మకం ఉంచారు. మనం కూడా అదే విధంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి. 

ఈనాటి రెండవ పఠణంలో పునీత యాకోబు గారు దేవుని ప్రజల యొక్క జీవితం ఏ విధంగా ఉండాలో తెలిపారు అదేంటంటే విశ్వాసము దానికి తగినటువంటి క్రియలు రెండు కూడా క్రైస్తవుల యొక్క జీవితంలో ఉండాలి.  కేవలము విశ్వాసం మాత్రమే కాదు కలిగి ఉండవలసినది, విశ్వాసముతో పాటు క్రియలు కూడా ఉండాలి. అబ్రహాము ఏ విధముగానయితే విశ్వాసము కలిగి తన యొక్క విశ్వాసానికి తగినటువంటి క్రియలను ప్రదర్శించి ఉన్నారో అదేవిధంగా ఎవరైతే దేవుడిని అనుసరిస్తున్నాం అని చెప్పుకుంటున్నారో వారందరూ కూడా విశ్వాసానికి తగినటువంటి క్రియలు కలిగి ఉండాలి అప్పుడే మన క్రైస్తవ జీవితమనేది యదార్థం అవుతున్నది. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు అన్యుల యొక్క ప్రాంతంలో (కైసరియా ఫిలిప్పి) తాను ఎవరు అనే అంశమును గురించి ప్రజలు తెలుసుకున్నారా? లేదా అని ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకొనుట నిమిత్తమై ఏసుప్రభు ఈప్రశ్న అడుగుతున్నారు. 
ఈ సువిశేష భాగములో ఏసుప్రభు  ప్రశ్నను రెండు విధాలుగా అడగటం చూస్తున్నాం.
మొదటి ప్రశ్న ఏసుప్రభు తన శిష్యులు తన గురించి ఏమని అనుకుంటున్నారు అడుగుచున్నారు. 

రెండవ ప్రశ్న ఏసుప్రభు ప్రజలు తన గురించి ఏమని భావిస్తున్నారు అని అడిగారు.మొదటి ప్రశ్నకు సమాధానం యేసు ప్రభువును గూర్చి కొందరు బాప్తిస్మ యోహానని, కొందరు ఏలియా అని మరికొందరు ప్రవక్తలలో ఒకరిని భావించారు. ఎందుకంటే ఏసుప్రభు యొక్క పరిచర్య జీవితం ప్రజలలో ఒక నూతన అనుభూతిని కలిగించినది. ఆయన సత్యమును ప్రకటించారు, అన్యాయమును ఎదిరించారు, పేదల తరుపున పోరాడారు, మరణించిన వారిని జీవంతో లేపారు అందుకని ప్రజలు ప్రభువును గురించి ఒక్కొక్క భిన్న అభిప్రాయమును కలిగి ఉన్నారు. అదే ప్రశ్న తన శిష్యులను అడగగా పేతురు గారు మాత్రము నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు అని సాక్ష్యం ఇచ్చారు. ఇది సాక్షాత్తు దేవుడై తనకు ఎరుక పరిచారు. అదేవిధంగా పేతురు గారికి యేసుప్రభుతో ఉన్నటువంటి అనుభవమును బట్టి, ఆయన చూసిన కార్యములుబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయము ప్రభువునకు తెలియజేశారు. ఈరోజు మనందరం కూడా ధ్యానించవలసినటువంటి అంశం ఏమిటంటే యేసు ప్రభువు గురించి మనకు ఎలాంటి అభిప్రాయం ఉన్నది. 

ఆయనను మెస్సయ్యగా అంగీకరిస్తున్నామా. మన రక్షకునిగా తెలుసుకుంటున్నామా. ఆయన మన దేవుడు అని, ఆయన చూపించినటువంటి బాటలో మనం నడుస్తూ ఉన్నామా?. ఏసుప్రభువుని వెంబడించేటటువంటి శిష్యులకు ఉండవలసినటువంటి మూడు ప్రధానమైనటువంటి లక్షణములు గురించి ప్రభువు తెలుపుచున్నారు. నన్ను అనుసరింప గోరువాడు తనను తాను పరిత్యజించుకొని, సిలువను ఎత్తుకొని, అనుసరించవలెను అని ప్రభువు పలికారు. మొట్టమొదటిగా ప్రభువుని అనుసరించేటటువంటి పరిత్యజించుకొనే మనసు కలిగి ఉండాలి అనగా ప్రభువు కొరకు దేనినైనా విడిచి పెట్టే మనసు ఉండాలి. అదేవిధంగా సిలువ ఎత్తుకొని అనుసరించమని తెలిపారు అనగా బాధలను కష్టాలను ప్రేమతో చేకుని అనుసరించాలి. ప్రభువును వెంబడించుట అనగా ఆయన బోధన ప్రకారము జీవించుట ఆయన నడిచిన మార్గంలో నడుచుట. మన యొక్క విశ్వాస జీవితంలో ప్రభువుని ఆధ్యాత్మికంగా తెలుసుకొని ఆయనకు సాక్షులుగా జీవించాలి ఆయన ఒక బాటలో నడవాలి. ప్రభు యొక్క సేవా జీవితంలో ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే మన యొక్క విశ్వాసము క్రియలు ఒకే విధంగా ఉంటాయి

Fr. Bala Yesu OCD

24 వ సామాన్య ఆదివారము

24 వ సామాన్య ఆదివారము

యెషయా 50 : 5 - 9 
యాకోబు 2 : 14 - 18 
మార్కు 8 : 27 - 35
క్రిస్తునాధుని యందు ప్రియా సహోదరి సహోదరులారా ! 
ఈనాడు తల్లి తిరుసభ 24 వ సామాన్య ఆదివారమును కొనియాడుచియున్నది. ఈనాటి మూడు దివ్య గ్రంథ పఠణములు యేసు మార్గమే మన మార్గము అనే అంశమును ధ్యానించమని తల్లి తిరుసభ మనలను అందరిని ఆహ్వానిస్తుంది. ఈనాటి సువిశేష పఠనములో యేసు ప్రభు మూడు విషయాలను తెలియపరుస్తూ, ధ్యానించమని మనలని అందరిని కూడా ఆహ్వానిస్తున్నారు. 
1 . బాధలు
2 . మరణం
  3 . పునరుత్ధానం

బాధలు రెండు రకములు. “మొదటిగా మనిషి కొనితెచ్చుకొనేవి”.  ఏ విధంగా అంటే దేవునికి అవియధేయతగ ప్రవర్తించటం ద్వారా, లేక పాప మార్గములో నడవడం వలన బాధలు కష్టాలు వ్యాధులు మన జీవితంలోనికి వస్తాయి. మనకు పరిశుద్ధ గ్రంధములో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఎవరైతే దేవునికి ఎదురు సమాధానం చెప్పడం ద్వార వారికి బాధలు కష్టాల లోనికి నెట్టబడతారు.   (సంఖ్య 12) లో మిరియం, మోషే, అహరోనులు సోదరి. ఆమె ఏరికోరి వ్యాధిని కొనితెచ్చుకున్నది. ఒకరోజు మిరియం తన సోదరులు దేవునితో సంభాషించడం చూచి, తాను మనసులో గొణుగుకొవడం మొదలుపెట్టింది. ఇది గ్రహించిన యావె దేవుడు తనకు బుద్ధి చెప్పడానికి తనకు భయంకరమైనటువంటి కుస్తీ రోగాన్ని తనకు ఇస్తూ ఉన్నాడు. ఇదే కదా ఏరికోరి జీవితంలో కష్టాలను కొని తెచ్చుకోవడం అంటే?
 రెండొవదిగా “దేవుడు ఒసగిన కష్టాలు”. దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయడానికి దేవుడు ఒసగిన కష్టాలు. యేసు ప్రభువు తన యొక్క జీవితంలో కష్టాలను బాధలను యావె దేవుడు ఇచ్చాడు. దేనికోసం అంటే మనందరికీ రక్షణ తీసుకొని రావడంకోసం. క్రైస్తవ జీవితంలో ఎదుర్కొనే కష్టాలు వ్యక్తి గతమైన కష్టాలు కావు, కానీ పరోపకారమైన కష్టము. ఎందుకు అంటే మన కష్టాలు ఇతరులకు జీవమును ఇచ్చే విధంగా ఉంటుంది కాబట్టి క్రైస్తవ బాధలు అనేవి పరోపకారమైన ఇబ్బందులు. యేసు ప్రభువు బాధలు కష్టాలు గురించి కొత్త అర్ధాన్ని ఇస్తున్నారు. ఏ విధంగా అంటే యేసు ప్రభు జన్మించక ముందు వరకు బాధలు కష్టాలు ప్రజల జీవితంలో మనం చేసిన పాపాలకి లేదా మన తల్లిదండ్రుల చేసిన పాపాలకి మనం ఈ బాధలను మన జీవితంలో వస్తాయని ఇశ్రాయేలు ప్రజలు నమ్మేవారు. కానీ యేసు ప్రభు బాధలకు కష్టాలకు కొత్త అర్ధాన్ని ఇచ్చాడు.ఈ కొత్త అర్ధం, మనకు అర్ధం కావాలంటే (యోహాను 9 :1 - 3) లో మనము చూస్తున్నాం. పుట్టి గ్రుడ్డివానికి దృష్టిదానం. అపుడు శిష్యులు ఈ విధంగా అడుగుతున్నారు, బోధకుడా ! వీడు గ్రుడ్డివాముగా పుట్టుటకు ఎవడు చేసిన పాపము? వీడా? వీని తల్లిదండ్రుల? అని యేసుని అడిగిరి. అందుకు యేసు వీడు కానీ వేడు తల్లిదండ్రులుగానీ పాపము చేయలేదు. దేవుని యొక్క కార్యము వీనియందు భయాలుపడుటకై వీడు గ్రుడ్డివానిగా పుట్టెను. యేసు దీనికి ఇచ్చిన అర్ధం ఏమిటంటే బాధలు కష్టాలు మానవుని జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే. వాటిని మానవుడు విశ్వాసం ద్వారా స్వీకరించాలి. 

మరణం.
యేసు ప్రభు సువిశేష పఠనములో మరణము గురించి ప్రస్తావించారు. మనిషిని మనం రెండు విధాలుగా చంపవచ్చు
శారీరకంగా 
మానసికంగా.
శారీరకంగా అంటే పొడచుట , నరుకుట, విషప్రయోగం   మరియు పలువిధములుగా మనిషిని చంపవచ్చు. రెండొవదిగా మానసికంగా మన మాటలద్వారా క్రియలద్వారా మనిషిని చంపవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే మనిషిని బ్రతికి ఉండగానే చంపేయడం. 
మానసికంగా  ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో శారీరక మరణానికి ముందు మానసికంగా పలువిధాలుగా మరనిస్తున్నాడు. . 
1 . ప్రత్యక్షంగా పొగుడుతూ పరోక్షంగా కించ పరిచేటువంటి క్రియల ద్వారా. 
2 . ఓక వ్యక్తి దగ్గర మేలులు పొంది, అతని నాశనము కోరుట ద్వారా 
3 . ఓక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకొని  అతనికి వ్యతిరేకముగా చేయుటద్వారా 
4 . నమ్మించి మోసము చేయుట ద్వారా 
ఇటువంటి పనుల ద్వార మనము మానసికంగా అనేక మందిని నిర్జీవులుగా మారుస్తాము.  

పునరుతానము
భారతదేశంలో మనకు అనేకమైన మతాలు ఉన్నవి. ఉదారణకు , హిందువులు, బౌద్దులు, ముస్లింలు, సిక్కులు, జైనులు ఇలా అనేకమైన మతాలు ఉన్నవి. బౌద్దులకు - గౌతమ బుద్దుడు, ముస్లింలకు - మొహమ్మద్, సిక్కులకు - గురునానక్, జైనులకు - వర్ధమాన మహావీర, హిందువులకు - ఎవరు లేరు. వీరి అందరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదు నేను చనిపోయి మళ్ళీ తిరిగి మరణము నుండి లేవబడతాను అని, అలా చెప్పింది కేవలం సజీవుడయినా యేసు ప్రభు. క్రైస్తవ మతానికి వ్యవస్థాపకుడు.ఇదే క్రైస్తవత్వంలో ఉన్నటువంటి విశిష్టత , మరి ఏ మతమునకు లేనటువంటి ప్రత్యేకత. సువిశేష పఠనములో యేసు ప్రభు ఒక ప్రశ్ననే రెండు విధాలుగా అడుగుతున్నారు. 
1 . యేసు ప్రభు తన శిష్యులను ప్రజలు తనను గురించి ఎవరు అని భావించుచున్నారు అని అడిగారు? 
2 . యేసు తన శిష్యులను నేను ఎవరని మీరు భావించుచున్న్నారు? అని అడిగారు.  
ఈ రెండు ప్రశ్నల మధ్య తేడా ఏమిటంటే
1 . మనిషి గురించి తెలుసుకొనుట,  
2 మనిషిని తెలుసుకొనుట.
యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే దేవాలయానికి రావడం అవసరంలేదు ఎందుకంటే 
a . పరిశుద్ద గ్రంధము చదివి యేసును తెలుసుకొనుట. 
b . పుస్తకాలను చదివి తెలుసుకోవచ్చు. 
c. లేకపోతే ఇపుడు మన సెల్ ఫోన్ ద్వారా యేసును గురించి ఎక్కడ పుట్టారో ఎం చేసారో తెలుసుకోవచ్చు. 
కానీ మనం యేసును తెలుసుకోవాలంటే దేవాలయానికి రావాలి. 
1 . ప్రార్ధన - పునీత అవిలాపురి తెరేస్సమ్మగారు ప్రార్ధన గురించి ఇలా చెబుతున్నారు. ప్రార్థన అనేది మనకు తెలిసిన వారితో స్నేహపూర్వక సంభాషణ. పునీత పేతురు గారు కూడా తన యొక్క జీవితంలో యేసు ప్రభుని గురించి ఎరిగియున్నాడు కాబట్టి యేసు అడిగిన వెంటనే “నీవు నిజమైన క్రీస్తువు” అని ప్రత్యుత్తరము యిచ్చియున్నాడు. ఇది కేవలం తన యొక్క ఆత్మసంబంధంతో చెప్పగలిగియున్నాడు. 
రెండొవ పఠనంలో మనము చూస్తున్నాం మనయొక్క విశ్వాసం కేవలం మాటల రూపంలో మాత్రమే కాకుండా చేతల రూపంలో ఉండాలని యాకోబు గారు మనకు తెలియపరుస్తున్నారు. పేతురు ఏ విధంగా అయితే దేవునితో ఆత్మీకసంబంధం ఏర్పరచుకొని తనయొక్క విశ్వాసాన్ని బలపరచుకున్నాడో అదేవిధంగా మనం కూడా మన యొక్క విశ్వాసంలో ధృడపడాలి. అంటే అది కేవలం మాట ద్వారా మాత్రమే కాకుండా మనయొక్క చేతల ద్వారా మనము ధ్రువపరుస్తూ ఉండాలి. 
   


బ్రదర్. రవి నరెడ్ల ఓ.సి.డి

లూకా 5: 33-39

  లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము త...