13, ఫిబ్రవరి 2021, శనివారం

6 వ సామాన్య ఆదివారము

 6 వ సామాన్య ఆదివారము

క్రీస్తు నాథుని యందు ప్రియమైన స్నేహితులారా!

దేవుడు మానవులకు ఒసగు వరములలో ముఖ్యమైనది దయ; ఈ దయనే కనికరము, 

జాలి, కరుణ అని అంటుంటాము. ‘వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు 

అక్కరలేదని యేసు ప్రభువు (మత్తయి 9:12) వ వచనములో చెప్పిన మాటలు ఈనాడు 

మనకు గుర్తుకువస్తుంటాయి. మనము ఈరోజు మూడు పఠణాలను చదివినపుడు మనకు 

దేవుడు ఇచ్చు సందేశము ఏమిటి అంటే, శారీరక, మానసిక వ్యాధులతో బాధపడు వారిని 

దేవుడు దయచేత స్వస్థపరుస్తున్నాడని అని అర్థం అవుతుంది. ఈనాటి మొదటి 

పఠనము కుష్ఠ రోగము పొందిన వ్యక్తి యొక్క జీవిత విధానాన్ని చాల క్లుప్తముగా 

వివరిస్తుంది.

 

పాత నిబంధనలో కుష్ఠరోగము ఉన్న వారి పరిస్థితి చాలా ఘోరముగా ఉంటుంది. వారిని 

అశుద్దులుగా పరిగణించేవారు. ఈనాటి మొదటి పఠనములో (లేవి 13 :45) వారికి 

ఉన్ననియమాలు, చిరిగిన బట్టలు, తల విరబోసుకోవాలి. అతడు లేక ఆమె ప్రజల 

మధ్యలోకి రావాలంటే, నేను అశుద్ధుడను, అశుద్ధురాలిని అని కేకలు పెట్టాలి. వారు ఊరి 

బయట జీవించాలి, అటువంటి నియమాలను గూర్చి తెలియజేస్తుంది. రెండవ 

పఠనములో పునీత పౌలు గారు, మీరు ఏమి చేసినను దేవుని మహిమ కొరకై 

చేయవలయునని, ఎవరినీ భాధ పెట్టకుండ, నిస్వార్ధముతో, అందరిని సంతోషచిత్తులను 

చేయ ప్రయత్నిచండి, అని చెబుతూ నేను ఏ విధముగానైతే క్రీస్తును అనుసరించానో 

మీరును నన్ను అనుసరించండి అని నేర్పుతున్నారు.

సువిశేష పఠనములో కుష్టు రోగి ఎంతో వినయముతో చేసిన తగ్గింపు ప్రార్ధన దేవుడు 

ఆలకించి, అయన మీద  జాలి, దయ, కనికరము, ప్రేమ చేత అతనిని తాకి స్వస్థ 

పరిచారు. మార్కు 1: 45 లో చూసినట్లయితే కుష్టు రోగి తాను పొందిన స్వస్థత 

అనుభవాన్నిఎక్కువగా ప్రచారము చేయసాగెను. నలుదెసల నుండి జనులను దేవుని 

యొద్దకునడిపించగలిగాడు.

 

కాబట్టి ప్రియా స్నేహితులారా! మనలో చాలామంది, అనేక రకములైన కుష్టు రోగములతో 

బాధపడుతున్నాము. కుళ్ళు, కుతంత్రాలతో మనము కూడా కుష్టు రోగులుగా 

మారిపోతున్నాము. అదే విధముగా కుల, మాత, ప్రాంతీయ, వర్గములుగ విడిపోయి, ఒకరి 

పట్ల ఒకరు ఈర్ష్య, అసూయ, గర్వము, అహంకారములతో కుష్టు రోగులుగా దేవునికి 

దూరముగా, సంఘానికి దూరముగా, కుటుంబానికి దూరముగా జీవిస్తున్నాము. ఎప్పుడైతే 

మనము మన స్థాయిని గమనించి పశ్చాత్తాపపడి, దేవుని యొద్దనుండి, స్వస్థత అడిగితే 

దేవుడు మనలను తాకి స్వస్థపరుస్తాడు. అప్పుడు మన హృదయాంతరంగాలు 

శుద్ధమై పునీత పౌలు గారివలె క్రీస్తును అనుసరించగలము, ఎంతోమందిని దేవుని 

యొద్దకు నడిపించగలము. కాబట్టి దేవుడు మనలను తాకి శారీరకంగాను, మానసికంగానూ 

స్వస్థపరచాలని వినయముతో ప్రార్ధించి దేవుని దయను పొందుదాము. ఆమెన్ 

                By  Br. Suresh kolakaluru OCD 

 


ఆగమన కాలం మొదటి ఆదివారం

యెషయా 63:16-17, 64: 1. 3-8 1 కొరింతి 1:3-9 మార్కు 13: 33-37 ఆగమన కాలం మొదటి ఆదివారం తో దైవార్చన కొత్త సంవత్సరము ప్రారంభమగుచున్నది. ప్రభువు య...